Thursday, January 3, 2013



యాత్రా దీపికవరంగల్ జిల్లా ఆవిష్కరణ సభ

 

నా పుస్తకం యాత్రాదీపికవరంగల్ జిల్లా ఆవిష్కరణ సభ 7-12-2012 మధ్యాహ్నం 1 గం. కి హైదరాబాదులోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీస ఆరుబయలు రంగస్ధలంలో జరిగింది.  .జీ. ఆఫీసులోని సాహితీ సంస్ధ రంజని ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకి ఎకౌంటెంట్ జనరల్ శ్రీ సుందరరాజా గారు అద్యక్షత వహించగా ప్రఖ్యాత రచయిత శ్రీ  అంపశయ్య  నవీన్ గారు పుస్తకావిష్కరణ చేసి, పుస్తకం గురించి మాట్లాడారు.  ఆచార్య అయినవోలు ఉషాదేవి, పీఠాధిపతి,  భాషాభివృధ్ధి పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్య అతిధిగా విచ్చేసి పుస్తకం గురించి తెలియజేశారు.   రంజని అద్యక్షులు శ్రీ చీకోలు సుందరయ్యగారు నిర్వహించిన ఈ సభకి వ్యాఖ్యాతగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి పద్మలతా జయరాంగారు వ్యవహరించారు.  రంజని కార్యదర్శి శ్రీ మట్టెగుంట వెంకట రమణగారి వందన సమర్పణతో మధ్యాహ్నం 2 గం. లకి సభ ముగిసింది.

 

సభ ప్రారంభించటానికి ముందు శ్రీమతి శిష్ట్లా వసంత లక్ష్మి, శ్రీమతి అన్నదానం సీత, శ్రీమతి మన్నేపల్లి సరోజ గార్ల సంగీత విభావరి ఆహూతులను అలరించింది.

 

ప్రతులకు

శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి

B 391, శ్రీ కృష్ణానగర్

యూసఫ్ గూడా

హైదరాబాదు – 500 045

ఇంకా

నవయుగ పబ్లికేషన్స్

విశాలాంధ్ర పబ్లికేషన్స్

వెల  రూ. 60

సంగీత విభావరి - శ్రీమతులు మన్నేపల్లి సరోజ, శిష్ట్లా వసంతలక్ష్మి, అన్నదానం సీత
ఎడమనుంచి కుడికి నంద్యాల మురళీకృష్ణ, చీకోలు సుందరయ్య, పి.యస్.యమ్.లక్ష్మి, ఉషాదేవి, అంపశయ్య నవీన్, సుందరరాజా, మట్టెగుంట వెంకటరమణ
రంజని సభ్యులు శ్రీ కుంపటి ఆదిశేషు తయారుచేసిన ఫ్లెక్సీ
పుస్తకం గురించి వివరిస్తున్న రచయిత్రి
సభలో ప్రసంగిస్తున్న శ్రీ నవీన్
ప్రసంగిస్తున్న ఆచార్య ఉషాదేవి
ఆహూతులులో ఒక భాగం
రచయిత్రిని సత్కరిస్తున్న ఆచార్య ఉషాదేవి
శ్రీమతి ఎ.జె.సావిత్రీ మౌళి, రచయిత్రి
ఆభినందిస్తున్న పులిగడ్డ సిస్టర్స్ .. అదేనండీ మా చెల్లెళ్ళు

అభినందిస్తున్న కాలనీ మిత్రురాళ్ళు
ఎంతో అభిమానంతో వచ్చి మా ఇద్దరినీ అభినందిస్తున్న శ్రీమతి మాలాకుమార్
శ్రీ సుందరరాజా గారిచే శ్రీ వెంకటేశ్వర్లుగారికి సన్మానం
ఎ.జి. శ్రీ సుందరరాజా, మావారు, నేను
ఆఫీసు మిత్రులలో కొందరు (ఫుల్ సపోర్ట్ వీళ్ళనుంచి)
కాలనీ మిత్రులు
బంధువులతో
రంజని మిత్రులు శ్రీయుతులు కుంపటి ఆదిశేషు, నంద్యాల మురళీకృష్ణ, మట్టెగుంట వెంకటరమణ, నేను, మా అబ్బాయి తేజస్వి, చిరకాల కుటుంబ మిత్రులు శ్రీ మహమూద్
రంజని సభ్యులతో