Wednesday, July 6, 2011

శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్ధానం, నెల్లూరు

ఆలయ గోపురం
ఆలయం లోపల దశ్యం
ఆలయం వెనుక పినాకినీ నది

శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్ధానం, నెల్లూరు

ఆలయం: శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి ఆలయం

స్ధలం: రంగనాయకులపేట, నెల్లూరు

రవాణా సౌకర్యం: నెల్లూరుకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యం వున్నది.

వసతి: నెల్లూరు పట్టణంలో అనేక హోటల్స్ వున్నాయి.

దైవం: శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాధ స్వామి

అమ్మవారు: రంగనాయకి

ఆలయ నిర్మాణ సమయం: 7 – 8 శతాబ్దాలలో

దర్శన సమయాలు: ఉదయం 6-30 నుంచీ మధ్యాహ్నం 12 గం. ల దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచీ రాత్రి 9-00 గం. ల దాకా

విశేషాలు: ఉత్తర శ్రీరంగంగా ప్రసిధ్ధిగాంచింది.

దేవాలయం వెనుక ద్వారం బయట పినాకినీ (పెన్నా) నది ప్రవహిస్తూన్తున్ది.

కధా కమామీషూ

ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో ప్రస్తావించబడింది. ఒకసారి శ్రీమన్నారాయణుడు భూలోక విహారం చేయాలనుకుని ఆదిశేషుని క్రీడా శైలముగా వెలియవలసినదిగా ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం ఆది శేషుడు భూ లోకంలో పినాకినీ తటాన ఒక పర్వతంగా ఆవిర్భవించి, సత్య లోకందాకా ఎదిగాడు. దానితో మానవులంతా యజ్ఞ యాగాదులేమీ చెయ్యకుండానే విష్ణులోకం ప్రవేశిస్తూండటంతో దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరకెళ్ళి ఆయనని ప్రార్ధించగా, ఆయన ఈ గిరి పై తన పాదాన్ని మోపాడు. ఆది శేషుడు సంతుష్టుడై భార్యా సమేతంగా విష్ణుమూర్తిని అనేక విధములుగా ప్రార్ధించగా స్వామి సంతోషించి, ఈ గిరి నీ పేరున తల్పగిరిగా ప్రఖ్యాతినొందుతుందని వరమిచ్చాడు.

తర్వాత కశ్యప మహర్షి ఈ క్షేత్రంలో పౌండరీక యాగం చేశాడు. 11 వ రోజున వపా హోమం సమయంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. కశ్యప మహర్షి కోరికమీద ఆ క్షేత్రంలో శేషశాయియై వెలసి భక్తులకు అభయ ప్రదాతగా నిలిచాడు.

క్రీ.శ. 7 – 8 శతాబ్దములలో సింహపురిని పాలించిన పల్లవ రాజుల సమయంలో పునరుధ్ధరింపబడిన ఈ ఆలయం తదుపరి అనేక రాజుల పరిపాలనలో అభివృధ్ధి చెందింది.


Tuesday, July 5, 2011

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేదగిరి


గాలి గోపురం
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేదగిరి

ప్రదేశం వేదగిరి (నరసింహ కొండ)

జిల్లా నెల్లూరు .. నెల్లూరు నుంచి 8 కి.మీ. దూరం

ప్రయాణ సౌకర్యం నెల్లూరునుంచి బస్సు, ఆటో సౌకర్యం వున్నది.

కొలువైన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

ఆలయ నిర్మాణ సమయం కృతయుగములో వెలసిన దైవం..ఆలయం అనేకమార్లు పునరుధ్ధిరింపబడింది.

విశేషాలు చిన్న కొండమీద గుహలో 6 అడుగుల ఎత్తైన స్వామి విగ్రహం వెండి కవచంతో అలంకరింపబడినయనానందకరంగా వుంటుంది. దానికి కింద కశ్యప ప్రజాపతిచే ప్రతిష్టించబడ్డ 3 అడుగుల ఎత్తైన స్వామి విగ్రహం శ్రీ లక్ష్మీ అమ్మవారితో సహా వుంటుంది.

కొండ దిగువన పూర్వం యజ్ఞం కోసం ఏర్పాడు చేయబడి, కాలక్రమంలో కోనేళ్ళుగా మారిన హోమకుండాలు.

అమ్మవారు శ్రీ ఆదిలక్ష్మి

పరిసరాలు కొండమీదనుంచి అందమైన ప్రకృతి దృశ్యాలు కనబడతాయి. మంచి గాలి…ప్రశాంత వాతావరణం….తొందరగా అక్కడనుంచి కదిలిరాబుధ్ధి కాదు.

దర్శన సమయాలు ఉదయం 6 గం. ల నుంచి 12 గం. ల దాకా తిరిగి

సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం. ల దాకా.

కధా కమామీషూ

పూర్వం సప్తఋషులలో ఒకరైన కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్ధం ఈ వేదగిరికి దిగువగా ఏడు హోమకుండములేర్పరిచి, సప్తఋషులతో కలసి యజ్ఞం చేశారు. ఈ ఏడు హోమ కుండాలు కాలక్రమంలో ఏడు కోనేళ్ళయి వాటిలోని ఒక కోనేరునుంచి ప్రస్తుతం కూడా కొండమీదకి పైపుల ద్వారా నీరు సరఫరా కాబడుతున్నది. యజ్ఞానికి ముందు యాగ సంరక్షకునిగా ప్రసన్నలక్ష్మీ సహిత శ్రీ గోవిందరాజస్వామిని ప్రతిష్టించారు. ఈ స్వామి ఆలయం ఏడు కోనేళ్ళ దగ్గర ఇప్పుడు కూడా చూడవచ్చు.

యజ్ఞంపూర్తయిన తర్వాత హోమ కుండమునుండి ఒక తేజస్సు జ్యోతి రూపంలో ప్రస్తుతం నరసింహస్వామి వెలసిన ఈ కొండ గుహలో ప్రవేశించింది. ఆ జ్యోతి వెంట వచ్చిన కశ్యపుడు మొదలైన వారందరూ గుహలోకి వచ్చి జ్యోతి స్ధానములో వెలసిన నరసింహస్వామిని చూసి స్వామిని అక్కడ ప్రతిష్టించారు.

స్వామి వెలసిన గుహ అత్యంత ప్రాచీనమైనదికాగా, పల్లవ రాజైన విక్రమసింహవర్మ ఈ స్వామికి విశాలమైన ఆలయం కట్టించాడు. తర్వాత కాలంలో విజయనగర రాజులు కూడా స్వామిని దర్శించి అనేక కానుకలు సమర్పించారు.

ఆలయ ప్రవేశ మార్గములో వున్న ఏడంతస్తుల గాలి గోపురం సుమారు 500 సం. క్రితం రెడ్డిరాజుల కాలంలో నిర్మింపబడింది.

ఆలయ దర్శనంలో ఆసక్తి లేనివారు కూడా సంతోషంగా దర్శించదగ్గ ప్రదేశం ఇది.