Sunday, July 15, 2012

నంబి నారాయణ ఆలయం, తొండనూరు




నంబి నారాయణ ఆలయం, తొండనూరు
మద్దూరు నుంచి తొండనూరు చేరుకున్నాము.
పాండవపుర తాలూకాలోని వూరి పూర్వ నామధేయం కిరై తొండూరు. తొండనూరు అంటే చాలామంది చెప్పలేకపోయారుచివరికి ఒకరు ఈ  పాత పేరు చెప్పి దోవ చెప్పారు విశిష్టాద్వైత మత ప్రచారకుడు శ్రీ రామానుజులు వూర్వం ఇక్కడ చాలాకాలం నివసించి, తన మత ప్రచారాన్ని ఇక్కడనుంచే కొనసాగించారుఆయన ఇక్కడ ఎన్నో మహిమలను చూపించారుఆ కాలంలో హొయసాల రాజైన బిట్టి దేవర జైన మతస్తుడుఆయన కూతురికి దయ్యం పట్టి  ఎన్ని రకాల  వైద్యులకి చూపించినా నయంకాక తల్లడిల్లుతున్న సమయంలో శ్రీ రామానుజులు  చిటికెలో నయం చేశారుశ్రీ రామానుజులవారి తేజోస్వరూపానికి,  ఆయన బోధలు, మహిమలకు ఆకర్షితులైన బిట్టిదేవర తన భార్యతోసహా వైష్ణవ మతం తీసుకుని విష్ణువర్ధనుడయ్యాడు.

ఆ సమయంలో విష్ణువర్ధనునిచే నిర్మింపబడిన ఈ ఆలయం బేలూరులోని చెన్నకేశవాలయంలాగానే వుంటుందివెయ్యి సంవత్సరాలపైన చరిత్రగల ఈ ఆలయం లోపు కళాత్మకంగా తీర్చి దిద్దబడ్డ స్ధంబాలు బేలూరు ఆలయాన్ని పోలి వుంటాయిఈ ఆలయంలో నాలుగు స్తంబాలు అమరశిల్పి జక్కన్న చెక్కినవంటారుశ్రీ రామానుజాచార్యులవారు తొండనూరులో ఒక సుందర తటాకం కూడా నిర్మించారుఈ తటాకంలో నీరు ఎప్పుడూ ఎండి పోదుచాలా స్వఛ్ఛంగా వుంటుందికూడా.   ఒకసారి టిప్పుసుల్తాన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మెడలోని ముత్యాల హారం తెగి ముత్యాలు నీటిలో పడ్డాయిటఆ ముత్యాలను పైనున్నవారు స్పష్టంగా చూడగలిగారుటఅందుకే టిప్పు సుల్తాను ఈ తటాకాన్ని మోతీ తలాబ్ అని పిలిచారు.

ఈ ఆలయంలో నంబి నారాయణుని విగ్రహం 18 అడుగుల ఎత్తు వుంటుందిశ్రీ రామానుజుడు ప్రతిష్టించిన ఈ నారాయణుడు చతుర్భుజుడై,   శంఖం, చక్రం, గద, పద్మాలతో అలరారుతున్నాడునంబి అంటే నమ్మకంనమ్మి కొలిచేవారిని రక్షించే నారాయణుడు. అమ్మ అరవిందనాయకిఇక్కడ శ్రీ రామానుజులవారు తపస్సు చేసిన ప్రదేశంలో పాదాలు, శంఖం, చక్రం, నామాలు వున్నాయి

 గర్భగుడి ముందు మండపంలో ఉపాలయాలలో విష్వక్సేనుడు, రామానుజుడి శిష్యుడు తొండనూరు నంబి, ఇంకా ఇతర ఆళ్వారుల విగ్రహాలు వున్నాయిసువిశాలమైన ఆలయం, పెద్ద పెద్ద స్తంబాలతో విరాజిల్లుతోందిప్రహరీ కోట గోడలా వున్నది.

మేము వెళ్ళినప్పుడు కరెంటు లేదుమేము ఆలయం బయటకురాగానే అక్కడవున్న ఒక వ్యక్తి ఒక పెద్ద అద్దం తీసుకుని లోపలకి ఫోకస్ చేసి మమ్మల్ని పిలిచి చూపించాడుఎంత అద్భుతమైన దృశ్యమదిచుట్టూ చీకటి..స్వామి మూర్తి అద్దం ఫోకస్ లో వెలిగిపోతోందిస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారా అన్నట్లుంది ఆ దృశ్యం.

ఈ ఆలయం ఫోటోలు కావాలంటే శ్రీరంగపట్నంనుంచి పర్మిషన్ తెచ్చుకోవాలిఅది లేకుండా ఫోటోలు తియ్యనియ్యరుఅందుకే బయటనుంచి తీసిన ఫోటో మాత్రమే ఇవ్వగలుగుతున్నాను.

దర్శన సమయాలు  ఉదయం 9-30 నుంచి సాయంత్రం 5-30 దాకా.
 



Wednesday, June 6, 2012

ప్రయాణంలో పదనిసలు - 5

ప్రయాణంలో పదనిసలు
ఎంకి నాయుడుబావ ఇల్లా?

శ్రీశైలం నుంచి మద్దిమడుగు వెళ్ళివచ్చే దోవలో పొలాలలో ఇలాంటి మంచె ఇళ్ళు కనిపించాయి.  ఎందుకో వాటిని చూడగానే ఎంకి, నాయుడుబావ గుర్తుకొచ్చారు.  ఒక్కసారి కారుదిగి ఆ మంచె ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి రావాలనే తాపత్రయాన్ని చాలా కష్టపడి అణుచుకున్నాను.  మరి మీకేమనిపిస్తోంది దీన్ని చూస్తే?



Thursday, May 31, 2012

ఉగ్ర నరసింహస్వామి దేవాలయం, మద్దూరు



ఉగ్ర నరసింహస్వామి దేవాలయం, మద్దూరు

సుమారు 1200 సంవత్సరాల క్రితం హొయసల రాజు విష్ణవర్ధనుడిచే నిర్మింపబడిన ఈ ఆలయం నేటికీ అద్భుతంగా వున్నది.  ఇక్కడ స్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుంటాడు.  తొడపైన హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుండే స్వామి, ఎనిమిది చేతులుతో  విరాజిల్లుతుంటాడు.  రెండు చేతులు సంహారం చేస్తుంటే, ఇంకో రెండు చేతులతో హిరణ్యకశిపుని పేగులు మెడలో వేసుకుంటూవుంటాడు.  మరి రెండు చేతులలో శంఖం, చక్రం, ఇంకో రెండు చేతులలో పాశం, అంకుశం ధరించి వుంటాడు.  స్వామి నామంకింద ముక్కుపైన మూడోకన్ను వున్నది.  స్వామికి కుడిప్రక్క ప్రహ్లాదుడు, ఎడమవైపు గరుడుడు సేవిస్తూ వుంటారు.

మహా భారత యుధ్ధం చివరి రోజులలో అర్జనుడు నరసింహ రూపం దర్శించాలని వుందని శ్రీ కృష్ణుడిని ప్రార్ధించాడుట.  అది ఉగ్ర రూపం కనుక అది సాధ్యపడదని చెప్పి, అర్జనుని కోరిక తీర్చటంకోసం బ్రహ్మచేత శిల్పం రూపొందించాడుట.  ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్టించారు.

తర్వాత కాలంలో రాజులు యుధ్ధాలలో ఉపయోగించటానికి ఇక్కడ బాంబులు తయారు చేసేవారు.  అందుకే ఈ వూరి పేరు మద్దూరు అయింది.  మద్దు అంటే కన్నడంలో బాంబు అని అర్ధం.

ప్రదక్షిణ మార్గంలో వున్న ఉపాలయాలలో యశోద ఒళ్ళో చిన్ని కృష్ణుడు, నరసింహనాయకి అమ్మవారిని దర్శించవచ్చు.  ఇంకా ఆంజనేయస్వామి, నరసింహస్వామి, వేణుగోపాలస్వామి వగైరా దేవతా మూర్తుల రంగుల చిత్రాలు గోడలమీద వున్నాయి. 

పక్కనే వున్న ఆలయంలో వరదరాజస్వామి కొలువుతీరి వున్నాడు.  ఆలయం అప్పటికే మూసేసినా పూజారిగారు మేము చాలా దూరంనుంచి వస్తున్నామని తెలిసి తలుపులు తెరిచి దర్శనం చేయించారు.  ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడినది.  కమలం మీద నుంచున్న స్వామి 16 అడుగుల ఎత్తు వున్నాడు.  శంఖ, చక్ర, గదా పద్మాలతో, ఎదపై లక్ష్మితో శోభిల్లుతున్నాడు. 

ఆలయ సమయాలు ఉదయం 8 గం. లనుంచీ 2-30 దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచి 8-30 దాకా.

ఇంకో ముఖ్య విశేషం
మద్దూరు వడ చాలా పేరు పొందిందండోయ్.  చాలామంది చెప్పారు..మద్దూరు వెడితే అక్కడ వడ తప్పకుండా తినండి అని.  ఏ హోటల్ లో అడిగినా ఇస్తారు.  చాలా చోట్ల బోర్డులుకూడా వుంటాయి.  ఒక్కొక్కటీ 15 రూ.  రుచి కొంచెం వేరుగా వుంటుంది.  బహుశా రవ్వ వేస్తారనుకుంటాను.  బాగున్నాయి.  వెళ్ళినవాళ్ళు తప్పకుండా తినండి.  ఆలయ దర్శనం అయ్యేసరికి 2-45 అయింది.  మద్దూరులోనే భోజనం చేసి తిరిగి బయల్దేరాము.
 శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం, గోపురం
 శ్రీ వరదరాజస్వామి ఆలయం లోపల దృశ్యం
 హొయసల రాజుల చిహ్నం
 శ్రీ వరదరాజస్వామి ఆలయం

Wednesday, May 23, 2012

ప్రయాణంలో పదనిసలు - 4 వేసవిలో జలకాలాటలు




ప్రయాణంలో పదనిసలు - 4

వేసవిలో జలకాలాటలు - మల్లెల తీర్ధం

వేసవి..సూర్యారావుగారు అడ్డూ ఆపూ లేకుండా చెలరేగిపోతున్నారు..మీరేమో జలకాలాటలంటారేంటని కోప్పడుతున్నారా  మీ కోపం తగ్గించేందుకే మేము ఈనెల 14న, అంటే 14-5-2012 న వెళ్ళొచ్చిన జలపాతం గురించి చెబుతున్నాను.  మీరేమీ పదిరోజుల ప్రయాణాలు చెయ్యక్కరలేదు, వేలకి వేలు ఖర్చు పెట్టక్కరలేదు.  కొంచెం మెడ సారించి చూడండి.  హైదరాబాదుకు సుమారు 170 కి.మీ. ల దూరంలో శ్రీశైలం వెళ్ళే రోడ్డులో వుంది.  అదేనండీ మల్లెల తీర్ధం.  శ్రీశైలం వెళ్ళే దోవలో ఎడమవైపు బోర్డు కనబడుతుంది.  అక్కడనుండి లోపలికి 8 కి.మీ.ల దూరం వుంటుంది.  రోడ్డు  బాగుంది.  కంకర రోడ్డు.  

దీని గురించి అందరూ రకరకాలుగా చెప్పారు.  మా అబ్బాయేమో నువ్వా మెట్లు దిగలేవు, చాలా వున్నాయి అన్నాడు.  రోడ్డు బాగుండదని కొందరు.   కొందరేమో నీళ్ళు చాలా తక్కువ వుంటాయి.  సరే..ఇన్ని అభిప్రాయాలెందుకు..వెళ్ళు చూస్తే సరిపోతుందికదా అనుకున్నానుగానీ, దేనికన్నా టైము రావాలికదా.  ఈ మారు శ్రీశైలం ట్రిప్ లో ఆ టైము కుదిరింది.

అయితే అసలు సంగతి అక్కడకెళ్ళాక వుంది.  మరి 350 మెట్లు దిగాలి..మళ్ళీ ఇంటికెళ్ళాలంటే ఎక్కి పైకి రావాలి కూడా. భయపడకండి..మెట్లు చిన్నగానే వుంటాయి.   మెట్లు దిగిన తర్వాత దాదాపో 200 గజాల దూరం కొండపైన నడవాలి.  మరి జలపాతంలో జలకాలాడాలంటే ఆ మాత్రం కష్టపడాలండీ.  ఇంక చాలు…పైనుంచి మల్లెలలా జాలువారే జలపాతంలో హాయిగా మీ ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడండి.  ఇది చూసి వెళ్ళొచ్చినవాళ్ళుంటే చెబితే సంతోషిస్తా.

 మెట్లు దిగాక దోవ
జలపాతం

Tuesday, May 22, 2012

ప్రయాణంలో పదనిసలు




ప్రయాణంలో పదనిసలు
శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతి రోజు (15-5-2012) మేము ప్రకాంశం జిల్లాలో కొంత తిరిగాము.  సాయంత్రం భైరవకోననుంచి వచ్చేటప్పుడు  కనిగిరి  మొదట్లో కనిపించిన అంబరాలంటే సంబరాలివి.  ఇందులో అందాలొలికే విద్యుత్ అలంకరణ శ్రీ ఆంజనేయస్వామికోసం అలంకరించిన ప్రభట.  60 అడుగుల పైనే ఎత్తుగావుంది.  విద్యుద్దీపాలతో చాలాబాగా అలంకరించారు.  చూడండి.  బాగుందికదూ.  మేము చిన్నప్పుడు శివరాత్రికి ప్రభలుకట్టి తీసుకెళ్ళటం చూశాంగానీ, అవి ఇంటి దగ్గరకట్టు గుడిదాకా దేనిమీదన్నా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చేవారు.  కానీ ఇది గుడి పక్కన ఖాళీ ప్రదేశంలో కట్టారు.  తర్వాత తీసేస్తారుట.  మరి నేను చూసింది మీకూ చూపించాలికదా...