Saturday, July 26, 2008

Wadapalli , Nalgonda district, Andhra Pradesh, India

వాడపల్లి




లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి


20-1-2008 9-30 కి సూర్యాపేట లో బయల్దేరి నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా 11-40 కి వాడపల్లి చేరాం. ఇండియా సిమెంట్స్ కి ఎదురుగుండా ఉన్న రోడ్ లో అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క కచ్చా రోడ్ లో వెళ్తే ఆలయం వస్తుంది.


గుడి 6000 ఏళ్ళ క్రితందట. విగ్రహాన్ని అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట. స్వామి తొడ మీద అమ్మవారు వున్నట్లు ఆనుకుని వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో వొక అఖండం కింద ఇంకో అఖండం వున్నాయి. కిందవున్న అఖండం లో దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన వున్న అఖండం లో దీపం కదులుతూ వుంటుంది. కారణం స్వామి వుచ్వాశ నిశ్వాసలని చెపుతారు.


వొక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. ఆశీర్వాదం ఇంకా దుష్ట గ్రహ నివారణ కోసం .

ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.


మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:


గుడి ఎదురుగా కొంచెం దూరంలో ముచికుందా నది మరియు కృష్ణ నదుల సంగమం వుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. తెల్లగా వున్నదనిపించింది. విభూతి వల్లనేమో. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది.


క్షేత్ర పురాణం:

6000 ఏళ్ళ క్రితం అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట లింగాన్ని. వొక రోజు వొక బోయవాడు పక్షి ని కొట్టబోతే పక్షి వచ్చి స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాదుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాదుట. వేళ్ళ గుర్తులు స్వామి ఫాలభాగం పైన కనబడుతాయి. అక్కడ ఏర్పడిన రక్తం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట గుంటలో నీళ్లు వుంటాయి. నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా నీరు అలాగే వుంటుందట.



వొకసారి శంకరాచార్యులవారు బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని వొక బంగారం ముక్కకి తాడు కట్టి బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిత గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకున్నాదుట.



వసతికి వొక పెద్ద హాల్ వుంది కాని వేరే సౌకర్యాలు ఏమి లేవు. వుండటం కొంచెం కష్టమే.


నదీ సంగమం కనుక ఇక్కడ కర్మకాండలు కూడా చేస్తున్నారు. అస్థికలు కూడా కలుపుతారు.


మద్యాహ్నం 1-30 కి బయల్దేరి మిర్యాలగూడ రోడ్ మీద వున్న శ్రీ దుర్గా గార్డెన్ రెస్టారెంట్ లో భోజనం చేసి 2-50 కి మట్టపల్లి బయల్దేరాము.










0 comments: