Saturday, August 2, 2008

ఏడుపాయలు , మెదక్ డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్, ఇండియా


జనమేజయుడు తపస్సు చేసిన స్థలం

వన దుర్గా దేవి ఆలయము

డాం దృశ్యము


వన దుర్గా దేవి ఆలయము

వన దుర్గా దేవి

ఏడుపాయలు

ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయం, నాగిసానిపల్లి

21-03-2008
మార్గము..... మెదక్ మైన్ రోడ్డు నుంచి బాడ్కట్పల్లి రోడ్డులో (ముంబోజుపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఎడమ వైపు రోడ్డు) 11 కి. మీ.లు వెళ్తే కమాన్ వస్తుంది..దానిలోంచి లోపలకు మళ్ళీ 6.8 కి. మీ. లు
ఉదయం 7.00 గం. లకు బయల్దేరి 9.00 గం. లకు డాం (dam) చేరుకున్నాము. ఓక గంట అక్కడే తిరిగాము. నీళ్ళు వున్నాయి గానీ మురికిగావున్నాయి.

1.30 కి వనదుర్గ ఆలయం చేరుకున్నాము. 4 అడుగుల ఎత్తు ఆకర్షనీయమైన నల్ల రాయి విగ్రహం. చుట్టూ కోండలు, బండరాళ్ళు, మధ్య చిన్న ఆలయం....తెరచి వుంచు
వేళలు ఉదయం 7.00 గం. ల నుంచి సాయంత్రం 6.00 గం. ల దాకా

పక్కనే కోండమీద ఋషి తపస్సు చేసిన స్ధలముందిట. కోండ ఎక్కాము. దోవలో చిన్ని అమ్మవారి గుడి. ఇంకోంచెం పైకి వెళ్తే పుట్ట... పక్కనే పెద్ద బండరాళ్ళకింద తడికలు, రెల్లు గడ్డి తో తయారు చేసిన ప్రదేశంలో దుర్గ,వినాయకుడు,పరశురాముడు,శివలింగాల బోమ్మలు వున్నాయి దాని పక్కన కోండ రాళ్ళ కిం జనమేజయుడు తపస్సు చేసిన ప్రదేశంట...చుట్టూ పుట్ట ఏర్పడిందట అప్పుడు..దంపతులు పూజారులుగా వున్నారు.


వనదుర్గ కూడా స్వయం భూ ... ఆకాలంనాటిదేట. ఇంకా పైకి వెళ్తే చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు.
దరాబాదు నుంచి ఉదయం బయల్దేరి వెళ్తే సాయంత్రం తిరిగి రావచ్చు..అయితే ఆ రం, మంచినీళ్ళు తీసుకు వెళ్ళటం మరచిపోవద్దు.

0 comments: