Monday, August 4, 2008

కంది, మెదక్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,ఇండియా



చెరువు, గంగమ్మ ఆలయం

ఆలయ ముఖద్వారం


కంది

శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయం

హైదరాబాదు తిరిగివస్తూ సంగారెడ్డకి 4 కి. మీ. ల దూరంలో వున్న ఈ ఆలయం దర్శించాం. ఇది కూడా 250 సంవత్సరాల క్రతం కట్టిన ఆలయం. పెద్ద ప్రవేశ ద్వారం, చుట్టూ నివాస గృహాలు (అన్నీ ప్రస్తుతం నివాసయోగ్యంగా వున్నట్లులేవు), మధ్యలో చిన్న ఆలయం...ప్రహరీ గోడ దాటాక పక్కనే చెరువు, గంగమ్మ, లక్ష్మీనారాయణులకేకాక ఇంకా గుర్తు తెలియని ఆలయాలు ఇంకో రెండు వున్నాయి.

సరైన ఆదరణకు నోచుకోని ఇలాంటి కళాఖండాలు ఎన్నో. మనసంపద విలువని గుర్తించి ఆదరించాల్సిన బాధ్యత మనకు కూడా వుందనుకుంటే వీలు చూసుకుని ఈ ఆలయాలను దర్శించండి.

మీ వాహనంలో హైదరాబాదునుంచి ఉదయం బయల్దేరితే, కంది, నందికండి, కలబగూరు, చిట్కుల్ చూసి సాయంకాలానికి ఇంటికి చేరుకోవచ్చు. అయితే భోజనం వేళకి చిట్కుల్ చేరుకోండి లేకపోతే భోజనం మంచినీళ్ళు తీసుకు వెళ్ళండి.

0 comments: