Thursday, December 10, 2009

చిదంబర రహస్యం--3



చిదంబంరంలో ఇతర దర్శనీయ స్ధలాలు

తిల్లయ్ కాళి ఆలయం
 ఈ ఆలయానికి సంబంధించిన ఒక కధ.. ఒకసారి శివునికీ, శక్తికీ మధ్య నాట్య పోటీ జరిగింది.  దానిలో ఓడిన శక్తిని తిల్లయ్ సరిహద్దులలో వుండవద్దని స్వామి శాసించారు.  అందుకే ఆలయానికి ఉత్తరంగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈవిడ ఆలయం వుంటుంది.  ఇక్కడ శక్తి ఉగ్రరూపంలోను, శాంత రూపంలోను ఒకే ప్రాంగణంలో రెండు వేరు వేరు ఆలయాల్లో కొలువై వుంది.  ఉగ్ర రూపం విగ్రహం మొత్తం కుంకుమతో అలది కళ్ళు కాటుకతో తీర్చిదిద్దారు.



పాశుపతేశ్వర ఆలయం
కాళీ ఆలయం నుంచి అన్నామలైనగర్ లో వున్న ఈ ఆలయానికి ఆటోలో 25 నిముషాల ప్రయాణం.  నటరాజ ఆలయంనుంచీ ఈ రెండు ఆలయాలనూ చూసిరావటానికి ఆటోకి 140 రూ. తీసుకున్నాడు.  శివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన ప్రదేశం.  ఇక్కడ శివుణ్ణి వేటగాని రూపంలో ప్రతిష్టించారు.  అమ్మవారు నల్లనాయకి.


అన్నామలై యూనివర్సిటీ
ప్రసిధ్ధి పొందిన అన్నామలై యూనివర్సిటీ భవనాలను పాశుపతేశ్వరాలయానికి వెళ్ళే త్రోవలో చూడవచ్చు.


పిచ్చవరం
చిదంబరానికి 15 కి.మీ. ల దూరంలో వున్న పిక్నిక్ స్పాట్ ఇది.  ఇక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే సముద్రం బ్యాక్ వాటర్స్ లో  వున్న బారులు తీరిన తిల్లయ్ వృక్షాల  మధ్యనుంచి బోటు షికారు తప్పనిసరి.  ఈ వృక్షాల వల్లనే ఈ మధ్య వచ్చిన సునామీని ఈ ప్రాంతం తట్టుకుందట.  లేకపోతే నామరూపాలు లేకుండా పోయేదిట.  వీటికి ఇంకో పేరు అండిలయ్ సుర పొన్నయ్.  బొటానికల్ పేరు రెజోఫరా ఎపిక్యులేటా.  ఇద్దరికి ప్రత్యేక బోటు గంటకి 90 రూ. లు.  మనుషులు,  సమయం, సీజన్ బట్టి రేట్లు మారుతాయి.  ఇక్కడికి కూడా ఆటోలో వెళ్ళిరావచ్చు (250 రూ.)  బస్సుస్టాండునుంచీ గంటకోబస్సు కూడా వుంది.  నటరాజ ఆలయంముందునుంచి వెళ్ళే ప్రతి బస్సూ  బస్ స్టాండుకి వెళ్తుంది.




ఇవ్వండీ చిదంబర క్షేత్ర వివరాలు.  ఒక రోజు అక్కడ వుండేటట్లు వెళ్తే అన్నీ చూడచ్చు.

1 comments:

తేనెపట్టు said...

చాలా బాగుందండి. వివరణాత్మకంగా వ్రాసారు

rajan

http://naagola.wordpress.com/