Friday, May 4, 2012

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, చిక్ మళూరు



శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, చిక్ మళూరు

రహదారికి దగ్గరలో వున్న ఆలయం ఇది.  చిక్ మళూరు రోడ్డులోకి తిరిగిన వెంటనే కుడివైపు సందులో కొంచెం లోపలకి వెళ్తే వస్తుంది ఈ అతి పురాతన ఆలయం.  ఈ ఆలయం 3000 సంవత్సరాల క్రితందని పూజారిగారు చెప్పారు.  ఇక్కడ శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామా సమేతంగా దర్శనమిస్తాడు. 

రాజ రాజ మార్తాండ మహారాజు, మృకండ మహర్షిచేత ప్రతిష్టింప చేయించాడు ఈ స్వామిని.  ఈ స్వామిని సేవించినవారికి సత్వరం కళ్యాణం జరుగుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ ప్రతీతి.

పూజారిగారు చెప్పినదాని ప్రకారం…కణ్వానదికి పూర్వం నిర్మల అనే పేరుండేది.  కణ్వ మహర్షి ఇక్కడ అశ్వమేధ యాగం చేస్తే స్వామి ప్రత్యక్షమైనాడు.  అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామి దయాళుడు.  సంతానం కోసం, పెళ్ళికోసం, కోరిన కోర్కెలు నెరవేరటం కోసం ఈ స్వామిని ఆశ్రయించే భక్తులపాలిటి కల్పవృక్షం.

కణ్వ మహర్షి ఇప్పటికీ తెల్లవారుఝామున 2-30 ప్రాంతాల్లో వచ్చి స్వామికి పూజ చేస్తారని ఇక్కడివారి నమ్మకం.

ఆలయం మరీ పెద్దదికాదు. పూజారిగారు  ఆలయం ప్రాంగణంలోనే వుంటారు.  ఆలయం మూసిన తర్వాత ఎవరైనా వెళ్తే ఆయనని సంప్రదించవచ్చు.

 ఆలయం బయట ద్వారం
 లోపల ఆలయం
 రుక్మణీ సత్యభామా సమేత శ్రీకృష్ణుడు

0 comments: