Sunday, June 21, 2009

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, వాడపల్లి

ఆలయం లోపల దృశ్యం
ఆలయ గోపురం

శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్ధానము, వాడపల్లి

ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి తీర్ధం గురించి చాలామంది వినే వుంటారు. ప్రతి సంత్సరం చైత్రశుధ్ధ ఏకాదశినాడు ఈ వాడపల్లిలో వెలిసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం, తీర్ధం జరుగుతుంది. ఈ వేడుకలు చూడటానికి వేలాదిమంది భక్తులు తరలి వస్తారు.

పూర్వం దండకారణ్యంగా పిలువబడిన ఈ ప్రాంతంలో అనేక మంది ఋషిపుంగవులు తపస్సుచేశారు. ఎందరో మహాఋషుల తపస్సుతో పావనమైన ఈ ప్రదేశంలో, పవిత్ర గోదావరి నదిలో 300 సంవత్సరాలక్రితం లభ్యమైన స్వామి విగ్రహాన్ని మేళతాళాలతో తోడ్కొనివచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం గుడిలో ప్రతిష్ట చేశారు. తర్వాత పెద్దాపురం సంస్ధానాధీశులు శ్రీ వత్సవాయి తిమ్మజగపతిరాజు స్వామివారిని దర్శించి స్ధిరాస్తులు సమర్పించారు.

స్వయంభూ అయిన ఈ స్వామి విగ్రహం రక్తచందనం చెక్కలో మూర్తీభవింపబడ్డది. ఇటువంటి చెక్క విగ్రహం ఒక్క వాడపల్లిలోనే వుందంటారు.

భారతదేశ ప్రజలు గర్వించదగిన విషయం ఇంకొకటి జరిగింది ఇక్కడ. 1931వ సంవత్సరంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు ఈ స్వామివారి ఉత్సవంలో రధంపై స్వరాజ్యకేతనాన్ని బాపూజీ చిత్రపటంతో సహా ఊరేగించి మనవారి వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పారు. అంతటి పుణ్యభూమి ఇది.

ఏటా వాడపల్లి తీర్ధంనాడేకాక నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే ఈ దేవస్ధానం రావులపాలెంనుంచి లొల్లమీదుగా ప్రయాణిస్తే కేవలం 8 కి.మీ. ల దూరంలోనే వుంది.

దేవాలయం ఫోన్ నెంబరు 08855 271888





4 comments:

Suresh said...

mee vadapalli, ryali blogs choosanu. Maadi rayli paaka vooru.. happy to read about these temples. Thanks for the blogs.

psmlakshmiblogspotcom said...

Thank you Mr. Suresh.
If there is any more information about these two places, pl. include in your comments, so that interested people can get benefit with any extra information.
psmlakshmi

స్వాతి said...

Congratulations Lakshmi gaaru meeru marinni postlu raasi munduku saagaalani manasaara korukuntunnanu.

psmlakshmiblogspotcom said...

thank you Swathi garu
psmlakshmi