Friday, December 4, 2009

తిరువణ్ణామలైలో కార్తీక దీపం


ఆలయం లోపల వెలిగించిన జ్యోతి ఇది. ఇలాంటిదే ఆలయం వెలుపల కూడా వెలిగిస్తారు (కొండమీద కాకుండా)
ఆలయ ప్రధాన ముఖద్వారం (కనబడే గోపురం) షుమారు ఒక కి.మీ. దూరం వుంటుంది.
గిరి ప్రదక్షిణ
కొండమీద కార్తీక దీపం -- ఈ కొండకే ప్రదక్షిణ చేసేది
(దీపం వెలిగించక ముందు గిరి ప్రదక్షిణ)

తిరువన్నామలిలో కార్తీక దీపం

తమిళనాడులో ప్రసిధ్ధికెక్కిన శైవ క్షేత్రం తిరువణ్ణామలై. ఇక్కడ శివుడు పంచ భూతాలలో ఒకటైన అగ్ని లింగం రూపంలో వుంటాడు. పూజ్యులు రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడే వున్నది. తిరువణ్ణామలైలో ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో జరిగే అతి పవిత్రమైన, ప్రసిధ్ధికెక్కన కార్తీక దీపం చుట్టుప్రక్కల చాలా కిలో మీటర్ల దూరం వరకు కనబడుతుంది. ఈ దీపాన్ని పార్వతీ పరమేశ్వరుల నివాస స్ధలంగా చెప్పబడే కొండ మీద ప్రతి తమిళ కార్తీక పౌర్ణమి నాడు సాయం సంధ్యా సమయంలో వెలిగిస్తారు.

ఇక్కడ ఈ కొండకి చేసే ప్రదక్షిణని గిరి వలం అంటారు. దీనిని చాలా పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు. 14 కి.మీ. ల దూరం, చెప్పులు కూడా లేకుండా నడుస్తారు ఈ గిరి ప్రదక్షిణ కోసం. ముఖ్యంగా పౌర్ణమి నాడు షుమారు 60 అడుగుల వెడల్పు వున్న ఈ ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసే జనాన్ని చూస్తే తమిళనాడు మొత్తం అక్కడే వుందా అనిపిస్తుంది. అంత జనం. ఈ పర్వతాన్ని సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల రూపంగా కొంతమందంటే, పార్వతీ పరమేశ్వరులు ఈ శిఖరం మీద వుంటారని కొందరి నమ్మకం.

మా అబ్బాయి, తేజస్వి తిరువణ్ణామలైలోని అరుణై ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి అవటంతో ఆ క్షేత్రంతో కొంత అనుబంధం ముడిపడివుంది. వాడి చదువు కారణంగా మేమూ ఆ క్షేత్ర దర్శనం, గిరి ప్రదక్షిణ చేయగలిగాము. వాడు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఏడాది దీప దర్శనానికి వెళ్ళాడు. ఈ ఏడాది తమిళ కార్తీక పౌర్ణమి (రాత్రిపూట పౌర్ణమి వున్న రోజు) 1-12-2009 అయింది. ఆ ఫోటోలతో బాటు, దీపం వెలిగిన వీడియో, గిరి ప్రదక్షిణలో జన సందోహం వీడియో కూడా అప్ లోడ్ చెయ్యాలని ఉదయం నుంచి ప్రయత్నించి లాభం లేకపోయింది. ప్రస్తుతానికి ఫోటోలు చూడండి.


1 comments:

మాలా కుమార్ said...

ఫొటోలు చాలా బాగున్నాయి . మేము అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడ దర్షనము చేయించారు . థాంక్ యు.