Monday, October 26, 2009

శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం, న్యాల్కల్












లలితా పరమేశ్వరి ఆశ్రమం, నిజామాబాదు

మన రాష్ట్రంలో వున్న అతి కొద్ది లలితాదేవి ఆలయాల్లో ఇది ఒకటి. అతి సుందరమైన ఈ ఆలయం న్యాల్ కల్ రోడ్డులో ప్రశాంత వాతావరణంలో సందర్శకులను సమ్మోహితుల్ని చేస్తుంది.

ఈ ఆలయ శంఖుస్ధాపన 9-2-2000 న జరిగింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన 20-6-2003న జరిగింది.

ఆలయ ద్వారంలోనే 21 అడుగుల వినాయక విగ్రహం ఆలయంలోకి అడుగు పెడుతూనే వీక్షకులను భక్తి భావంతో కట్టి పడేస్తుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్తే విశాలమైన హాలులో శ్రీ మాత, శ్రీ లలితా దేవి గర్భాలయం దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి పాదాలను తలపై పెట్టుకుని రోజుకు తొమ్మిది చొప్పున తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు.

ప్రక్కనే వున్న శివాలయంలో పంచముఖ శివుని పానువట్టంమీద ద్వాదశ జ్యోతిర్లింగాలు 3-7-2007 న ప్రతిష్టింపబడ్డాయి.








0 comments: