Sunday, August 23, 2009

శ్రీ తిరుపతమ్మ దేవాలయం, పెనుగంచిప్రోలు


ఆలయం ముఖద్వారం

ఆలయంలోపల దృశ్యం




శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్ధానము, పెనుగంచిప్రోలు


తిరుమలగిరికి దగ్గరలోనే పెనుగంచిప్రోలులో వున్న శ్రీ తిరుపతమ్మ ఆలయం ఇక్కడ చాలా ప్రసిధ్ధిచెందినది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తజనసందోహంకూడా ఎక్కువే. తమపాలిటి కల్పవల్లిగా వెలిసిన ఈ దేవి దర్శనార్ధం చుట్టుపక్కలనుంచేకాక సుదూర తీరాలనుంచి కూడా భక్తులు వస్తారు...భక్తితో పసుపు కుంకుమలు సమర్పిస్తారు.

శ్రీ తిరుపతమ్మ శ్రీ వేంకటేశ్వరస్వామి అంశతో జన్మించిన కారణజన్మురాలు అంటారు. ప్రతి ఏటా ఉత్సవాల సమయంలో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంనుంచి మొదటి పసుపు కుంకుమలు అమ్మవారికి పంపించటం ఇప్పటికీ ఆనవాయితీగా వుంది.

ఇక్కడ శ్రీ తిరుపతమ్మ విగ్రహం ప్రక్కన ఆమె భర్త శ్రీ గోపయ్య విగ్రహం, వేరే మంటపాలలో శ్రీ అంకమ్మ, ఇతర దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి.

మాఘ శుధ్ధ పౌర్ణమినుంచి ఐదు రోజులు, ఫాల్గుణ మాసంలో నెల రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి।







0 comments: